Monday, April 21, 2025

మార్చిలోనే మాడుపగిలే ఎండలు

- Advertisement -
- Advertisement -

ఈ మూడు రోజులు భగభగలే.. ఈ నెల 20 వరకు ఎండల తీవ్రతతో పాటు
వడగాలులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచన ఆదిలాబాద్‌లో
41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత 21 నుంచి అక్కడక్కడా తేలికపాటి వర్ష సూచన

మన తెలంగాణ/హైదరాబాద్: మార్చి నెలలోనే ఎండలు మండి పోతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాజాగా రా ష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 41 డిగ్రీ ల ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదైనట్లు తెలిపింది. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణం లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడ గాలులు వీచే అవకాశం ఉందని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీచేసింది. మార్చి 16 నుంచి వచ్చే మూడు రోజుల పాటు ఎండలు మరింత పెరగనున్నాయని తెలిపింది. మార్చి 20 వరకు ఎండల తీవ్రతతో పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వడ గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగా ణ జిల్లాలో ఎఫెక్ట్ అధికంగా ఉండే అవకాశం ఉంది. అదిలాబాద్, కొమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల రాజన్న సిరిసిల్ల,

కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు అక్కడ వడగాలులు వీచే అవకా శం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం 11 గంటల నుం చి 3.30 గంటల మధ్య అవసరముంటేనే బయటకు రావలని సూచించింది. మార్చి 15న తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరం భీం జి ల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అదిలాబా ద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల వనపర్తి, నాగర్ కర్నూల్, జగిత్యాల , సిద్దిపేట జిల్లాలో 41 డిగ్రీల పైనే గరిష్ట ఉష్ణోగ్ర త నమోదైంది. మిగతా అన్ని జిల్లాలో దాదాపు 39 నుంచి 40 డిగ్రీల మధ్యన నమోదయ్యాయి. హైదరాబాద్‌లో మార్చి 15న 39.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండుతున్న ఎండలతో పాటు వడగాలుల తీవ్రత కూడా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో రానున్న రెండు రోజుల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉండగా మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News