Tuesday, September 17, 2024

రేపు భారత్‌లో కనువిందు చేయనున్న ‘సూపర్ మూన్’

- Advertisement -
- Advertisement -

భారత్‌లో సోమవారం సూపర్ మూన్ కనువిందు చేయనున్నది. నీలి రంగులో చంద్రుడు భారీ పరిమాణంలో దర్శనం ఇవ్వనున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ విషయం వెల్లడించింది. ఆదివారం ఉదయమే కానవచ్చిన ఈ సూపర్ మూన్ బుధవారం (21) వరకు వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చూడవచ్చునని నాసా సూచించింది. అయితే, మంగళవారం (20) ఉదయం సూపర్ మూన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుందని నాసా తెలిపింది.

ఈ ఏడాది ఇదే తొలి సూపర్ మూన్ కాగా, భారత్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కనిపిస్తుంది. కాగా, సూపర్ మూన్ అనే పదాన్ని రిచర్డ్ నోలీ అనే ఖగోళ శాస్త్రవేత్త 1979లో మొదటిసారిగా ఉపయోగించారు. పౌర్ణమి వేళల్లో చంద్రుడు భూమికి 90 శాతం అత్యంత చేరువగా వచ్చినప్పుడు దానిని సూపర్ మూన్ అని పిలుస్తారు. సాధారణ పౌర్ణమి వేళల్లో కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత భారీ పరిమాణంలో కనిపిస్తాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News