Tuesday, September 17, 2024

కుల గణాంకాల వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని వెల్లడి

‘ఏమి చేయగలం? ఇది విధానపరమైన అంశం’ అని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: వెనుకబడిన , ఇతర అణగారిన వర్గాల సంక్షేమం కోసం సామాజిక-ఆర్థిక కుల గణనను నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించమని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ సమస్య పాలన పరిధిలోకి వస్తుందని పేర్కొంది.

జస్టిస్ హృషికేష్ రాయ్ , ఎస్‌విఎన్. భట్టిలతో కూడిన ధర్మాసనం… పిటిషనర్ పి. ప్రసాద్ నాయుడు తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించింది. అతను జనాభా గణన కోసం డేటా గణనను వేగవంతం చేయాలని కోరుతూ పిటిషన్ వేశాడు. కానీ విచారణకు ధర్మాసనం నిరాకరించడంతో ఉపసంహరించుకున్నాడు.

“దీనిపై ఏమి చేయవచ్చు? సమస్య పాలన పరిధిలో ఉంది. ఇది విధానపరమైన అంశం” అని- పిటిషనర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రవిశంకర్ జంద్యాల , న్యాయవాది శ్రవణ్ కుమార్ కరణమ్‌లకు ధర్మాసనం తెలిపింది. అనేక దేశాలు కుల గణన చేశాయని, కానీ భారత్ ఇంకా చేయలేదని జంధ్యాల ఆవేదన వ్యక్తం చేశారు. “1992 నాటి ఇంద్ర సాహ్నీ తీర్పు (మండల్ కమిషన్ తీర్పు) ఈ కుల జనాభా గణనను కాలానుగుణంగా నిర్వహించాలని పేర్కొంది,” అని ఆయన వాదించారు.

ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోజాలదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. కోర్టు మూడ్‌ని పసిగట్టిన న్యాయవాది, బెంచ్ అనుమతించని పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరారు. కరణం ద్వారా దాఖలు చేసిన తన పిటిషన్‌లో నాయుడు కేంద్రం , దాని ఏజెన్సీలు ఇప్పటి వరకు జనాభా లెక్కలు-2021 కోసం గణనను నిర్వహించలేదని అన్నారు.

జనాభా గణన కేవలం జనాభా వృద్ధి తెలుసుకోడానికి కాదని, ఇది విధాన రూపకల్పన, ఆర్థిక ప్రణాళిక , వివిధ పరిపాలనా ప్రయోజనాల కోసం పనికొస్తుందని,  దేశ ప్రజల సమగ్ర సామాజిక-ఆర్థిక డేటాను కూడా అందిస్తుందని పేర్కొన్నారు.

సామాజిక-ఆర్థిక కుల గణన వెనుకబడిన వర్గాలను గుర్తించడానికి, సమాన వనరుల పంపిణీని నిర్ధారించడానికి ,లక్ష్య విధానాల అమలును పర్యవేక్షించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.

“1931లో కులాల వారీగా జరిగిన గణాంకం డేటా చాలా పాతది. జనాభా గణన , సామాజిక-ఆర్థిక కుల గణన (SECC) నుండి ఖచ్చితమైన డేటా సామాజిక న్యాయం , రాజ్యాంగ లక్ష్యాలను సాధించడానికి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైనది. స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా 2011లో నిర్వహించిన SECC కుల సమాచారంతో సహా సామాజిక-ఆర్థిక సూచికలపై సమగ్ర డేటాను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది” అని వినతి పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News