Tuesday, September 17, 2024

ఓటుకు నోటు కేసు… ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో వైసిపి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో సిబిఐ విచారణను కోరుతూ ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని… కోర్టులను వేదికగా చేసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

దాదాపు పదేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై ఆళ్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాఫ్తును సిబిఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News