- Advertisement -
హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలో దారుణం వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలిపై తన ప్రియుడితో ఓ యువతి అత్యాచారం చేయించి వీడియో తీసింది. ఓ యువతి తన స్నేహితురాలు (26) ని ఇంటికి పిలిచి మద్యం తాగించి మత్తులోకి దించింది. అనంతరం తన ప్రియుడు ప్రమోద్ తో ఆమెపై అత్యాచారం చేయిస్తూ వీడియో తీసింది. మరొకసారి యువతిని ఇంటికి పిలుపించుకొని ఈసారి తన స్నేహితుడు హరీష్ కోరిక తీర్చాలని స్నేహితురాలిని అడిగింది. స్నేహితురాలు నిరాకరించడంతో ఆమెపై సదరు యువతి దాడి చేయడంతో వీడియోలు వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి సదరు యువతి, ప్రమోద్, హరీష్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -