కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన మూవీ ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ… “ఈ సినిమాకు కథ నేనే రాశాను. సూర్యాపేట పరిసరాల్లో జరిగే కథ ఇది. ప్రభుత్వం నుంచి ఉచితాలు తీసుకోవడం వల్ల ముఖ్యం గా మధ్యతరగతి ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారో తెలిపే సబ్జెక్ట్ ఇది.
కథను డైరెక్టర్ రాజేశ్ చాలా బాగా తెరకెక్కించారు” అని అన్నారు. నిర్మాత అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ “మా హీరో కథకి పూర్తి న్యాయం చేశాడు. కన్నడ, మలయాళం చిత్రాలలో హీరోయిన్ గా నటించిన నైనా సర్వర్కి ఇది తెలుగులో మొదటి సినిమా. అయినప్పటికీ చాలా చక్కగా నటించింది. గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ రోల్ ఈ సినిమాకు కీలకం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను త్వరలో రిలీజ్ చేస్తాము”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నైనా పాల్గొన్నారు.