Sunday, October 6, 2024

రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నారు: సోనియా

- Advertisement -
- Advertisement -

రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నారు
వైఎస్సార్ 75 వ జయంతి సందర్భంగా షర్మిలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మెసేజ్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 75 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మెసేజ్ పంపించారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను వైఎస్ షర్మిల ముందుకు తీసుకెళ్తున్నారంటూ వైఎస్సార్ వ్యక్తిగత స్మృతులను ఎంతో గౌరవిస్తున్నానని సోనియా తెలిపారు. వై.ఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు జాతికి, కాంగ్రెస్ పార్టీకి, ఆంద్రప్రదేశ్ ప్రజలకు ఎంతో దోహదపడాల్సిన మహానేత లేకపోవడం పట్ల ప్రతిరోజూ సంతాపం తెలుపుతున్నామని, ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ ను గౌరవిస్తుందని తెలిపారు.

సోనియా అందించిన అద్భుతమైన సందేశాన్ని గుర్తించినందుకు చాలా ఉప్పొంగిపోయానని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో ఆయనకున్న అనుబంధాన్ని పంచుకున్న బంధాన్ని, మరీ ముఖ్యంగా తన చివరి శ్వాస వరకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా తన గురించి స్ఫూర్తిదాయకమైన మాటలకు ధన్యవాదాలు మేడమ్. నిజమైన కాంగ్రెస్ యోధుడిగా పార్టీకి సేవ చేయడం, ప్రజల కోసం పోరాడాలనే అత్యంత ప్రతిష్టాత్మక మిషన్‌ను గుర్తు చేసినందుకు నా తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని, రాహుల్ జీ ఆకాంక్షలను సాధించడానికి కృషి చేస్తానని వై.ఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ షర్మిల….

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదివారం కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లారు. రాత్రికి ఇడుపులపాయ అతిధి గృహంలో ఆమె బస చేశారు. సోమవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం విజయవాడకు పయనమవుతారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభకు సీఎం, మంత్రులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడకు వెళ్లనున్న ఆయన వై.యస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభకు హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News