- Advertisement -
హైదరాబాద్: సిఎం కెసిఆర్పై కొందరు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా సిఎం కెసిఆర్ రైతులతో మాట్లాడారన్నారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో బాధ్యతగా మాట్లాడితే మంచిదని సూచించారు. ఎంఐఎం, టిఆర్ఎస్ కలిసినందుకే తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయని కేంద్రమంత్రి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల కంటే గాంధీలో మంచి వైద్యం అందిస్తున్నామన్నారు. కరోనా కట్టడి కోసం ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
- Advertisement -