Thursday, September 19, 2024

సిఎం రేవంత్ అపాయింట్‌మెంట్ ఇస్తే మాట్లాడడానికి రెడీ:తమ్మారెడ్డి భరద్వాజ

- Advertisement -
- Advertisement -

నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చుతామని గతంలో సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము సిఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించామని రెండు, మూడుసార్లు అపాయింట్‌మెంట్ కోసం అడిగామని కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. సిఎం రేవంత్ అపాయింట్‌మెంట్ ఇస్తే వెళ్లి మాట్లాడటానికి రెడీగా ఉన్నామని ఆయన తెలిపారు. గద్దర్ గొప్ప వ్యక్తి ఆయన పేరుమీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదని ఆయన ప్రకటించారు.

కాగా, అంతకుముందు గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడంపై సిఎం రేవంత్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. సోమవారం సాయంత్రం సినారె జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో సిఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమపై తొలిసారి అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ ఏడాది జనవరిలో నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మారుస్తామని ఆయన ప్రకటించారు. గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై అభిప్రాయాలు, సూచనలు అందించాలని మరోసారి పరిశ్రమ పెద్దలకు సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News