Tuesday, September 17, 2024

రెండో వన్డేలో భారత్ ఓటమి

- Advertisement -
- Advertisement -

శ్రీలంకతో మూడు వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో టీమిండియా 32 పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(40), కామిందు మెండీస్(40) రాణించడంతో 240 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42.2 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(64), శుభ్‌మన్ గిల్(35), అక్షర్ పటేల్(44) రాణించినా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. స్పిన్ వలలో చిక్కుకొని భారత బ్యాట్స్ మెన్లు విలవిలలాడిపోయారు. లంక స్పిన్ ధాటికి భారత బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. లంక యువ బౌలర్ జెఫ్రీ వండర్స్ ఆరు వికెట్లు టీమిండియా నడ్డి విరిచాడు. దీంతో అతడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది ఈ సిరీస్ లంక 1-0 తో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News