- Advertisement -
ఇండోర్: హోల్కర్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు భారత జట్టు 9 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 40 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 12 పరుగులు చేసి కుహ్నెమన్ బౌలింగ్లో ముందుకు వెళ్లడంతో అలెక్స్ కారే స్టంపౌట్ చేశాడు. శుభమన్ గిల్ 21 పరుగులు చేసి కుహ్నెమన్ బౌలింగ్లో స్టీవెన్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఛటేశ్వర్ పూజారా ఒక పరుగు చేసి లయాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(03), రవీంద్ర జడేజా (03) బ్యాటింగ్ చేస్తున్నారు.
- Advertisement -