Saturday, July 6, 2024

బాలుడి ప్రాణం తీసిన పది రూపాయల పంచాయతీ

- Advertisement -
- Advertisement -

 

అహ్మదాబాద్: పది రూపాయల కోసం 17 ఏళ్ల బాలుడిని చంపిన సంఘటన గుజరాత్‌లోని అమరాయ్‌వాడి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనానికి బ్రేక్స్ ఫెయిల్ కావడంతో స్కూటర్ గ్యారేజ్‌కు తీసుకొచ్చాడు. గ్యారేజ్‌లో పని చేసే 17 ఏళ్ల యువకుడు బ్రేక్స్ ను సరి చేశాడు. అనంతరం బ్రేక్స్ సరి చేసినందకు పది రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఏ పనిముట్లు వాడకుండా బ్రేక్స్ సరిచేయడంతో ఇవ్వనని వాహనాదారుడు ఆ యువకుడితో గొడవకు దిగాడు. ఇంటికి వెళ్లిన అనంతరం తన ఇద్దరు స్నేహితులకు కలిసి వాహనాదారుడు గ్యారేజ్ కు వచ్చి యువకుడితో గొడవకు దిగారు. కోపంతో ఊగిపోయిన వాహనాదారుడు పదునైన కత్తితో యువకుడి కడుపులో పొడిచాడు. స్థానికులు వెంటనే ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యువకుడి చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గ్యారేజ్ యజమాని, యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

 

Teen stabbed for demanding Rs 10 for work by Biker
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News