ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రత్యేక చర్చ
బిసి రిజర్వేషన్లు, వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకోనున్న
ప్రభుత్వం ఇప్పటికే కులగణనపై ప్రభుత్వం చేతికి
నివేదిక వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీకి జస్టిస్
షమీమ్ అక్తర్ నివేదిక జనగణన ప్రకారం రాష్ట్రంలో
ఎస్సిల జనాభా 61,84,319 మంది ఇందులో
మాదిగల సంఖ్య 35లక్షలు ఉండొచ్చని అంచనా మాలలు
15లక్షలు, ఉపకులాల జనాభా 11లక్షలు
ఎస్సి వర్గీకరణ, బిసి కులగణనపై
నేడు ఉ.10గంటలకు కేబినెట్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ నేడు ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. బిసి సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ అ మలు అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ భేటీ త ర్వాత 11 గంటలకు అసెంబ్లీలో వాటిపై చర్చించి ఆమోదించనున్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించనుంది. శాసనమండలి, శాసనసభలో ఈ రెం డు నివేదికలను ప్రవేశపెట్టి చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి బిఆర్ఎస్ ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది. అందులో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించింది.
ఆ విధానంలోనే 2019లో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. అయితే బిసిలకు రిజర్వేషన్లను తగ్గించడంపై రాష్ట్ర హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వా టిని విచారించిన హైకోర్టు రిజర్వేషన్లను తగ్గించి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది గతంలో సుప్రీంకోర్టు ఇ చ్చిన మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. అంతేకాకుండా రిజర్వేషన్లను పాటించని ఎన్నికలను ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. అయితే సుప్రీం మార్గదర్శకాల ప్రకారం చేయాలంటే అందుకు రాష్ట్రంలోని బిసిల జనాభాను తేల్చాలి. బిసి గణన జరిపి జనాభాలో వారి శాతాన్ని ఖరారు చేయాలి. ఈ నేపథ్యంలోనే డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా బిసిల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయనుంది.
కేబినెట్ సబ్ కమిటీకి జస్టిస్ షమీమ్ నివేదిక
రాష్ట్రంలోషెడ్యూల్డు కులాలు(ఎస్సీ) వర్గీకరణకు మార్గం సుగమమం అ య్యింది. రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగి ఉన్న మాదిగలు, మాదిగ ఉపకులాలకు విద్యా, ఉద్యోగ, ఆర్ధిక, సామాజిక, రాజకీయరంగాల్లో న్యాయం జరిగేందుకు అవకాశాలున్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పున కు లోబడి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టి స్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్తో కలిసి సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో తన నివేదికను అందుబాటులో ఉన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ దామోదర రాజనరసింహ, మెంబర్ పొన్నం ప్రభాకర్లకు అందజేశారు.
నివేదికలోని అంశాలను క్యాబినేట్ సబ్ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఎస్పీ వర్గీకరణ అంశంపై మాల, మాదిగల మధ్య ఉన్న వైరుధ్యం దృష్టా మంత్రివర్గ ఉపసంఘం నివేదికలోని వివరాలను సోమవారం అధికారికంగా వెల్లడించలేదు. ముందుగా ప్రకటించిన మీడియా సమావేశాన్ని కూడా మంత్రివర్గ ఉపసంఘం రద్దుచేసుకుంది. రాష్ట్రంలోని షెడ్యూల్డుకులాలకు రిజర్వేషన్ల వాటా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం నాడు ప్రకటించిన జనగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.43 శాతంతో 61,84,319 మంది వరకు ఉన్నారు. ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్లు 15 శాతంగా అమలు అవుతున్నాయి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా 17.43 శాతం వరకు వారికి కోటా దక్కే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో మాదిగలు 35లక్షల మంది, మాలలు 15 లక్షల మంది, ఇతర ఎస్సీ ఉపకులాలు 11లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా.
సుప్రీంకోర్టు తీర్పుతో&
ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మమైన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రెండు గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును అమలుచేస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అంతే కాకుండా ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జస్టీస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ను ప్రభుత్వం నియమించింది. కమిషన్ సోమవారం తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది.