Friday, February 28, 2025

మార్చి 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మార్చి 6వ తేదీన నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో రెండో దఫా కులగణన నిర్వహించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన గణాంకాలపై కేబినెట్ చర్చించనుంది. అలాగే బిసిలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మార్చిలో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే ఈ అంశాలపై కూడా మంత్రి మండలి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అలాగే రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల్లో ఈ విషయంలో తర్జనభర్జన జరుగుతోంది. మార్చి 3వ తేదీతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియనుంది. దీంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని సమాచారం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News