- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో దాదాపు 600 పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం పల్లెలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 2072 కరోనా కేసులు నమోదుకాగా తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1.89 లక్షలకు చేరుకోగా 1116 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 1.58 లక్షల మంది కోలుకోగా 29 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం ఒక్క రోజే 54 వేల టెస్టుల చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 29.40 లక్షలకు చేరుకుంది.
- Advertisement -