- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 952 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2.58 లక్షలకు చేరుకోగా 1410 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.43 లక్షల మంది కోలుకోగా 13 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 49.29 లక్షల మంది కరోనా టెస్టులు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -