Tuesday, February 4, 2025

రాష్ట్ర ప్రభుత్వం బిసిలను మోసం చేస్తుంది: మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం బిసిలను మోసం చేస్తుందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత వి.శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సంవత్సరం వరకు కాలయాపన చేసి ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన నివేదిక తప్పుల తడక అని పేర్కొన్నారు. ఎన్నికల కోసం తప్పుడు నివేదికలను ప్రకటించారని ఆరోపించారు. కామారెడ్డిలో బిసి డిక్లరేషన్ చేశారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో బిసిల జనాభా ఎంత ఉందో తెలియదు అని, బిసిలకు మంత్రిత్వ శాఖ లేదని అన్నారు.

తమ అంచనా ప్రకారం తెలంగాణ జనాభా 4 కోట్లకు పైగా ఉంటుందని, ఓటర్లు 3 కోట్ల 40 లక్షల మందికి పైగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం చిల్లర వ్యవహారాలతో ఉద్యమాలు పుట్టుకు వస్తున్నాయని అన్నారు. బిసిల జనాభా 60 శాతానికి పైగా ఉండాలని, కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు తమ దగ్గర సర్వే కాలేదని అంటున్నారని పేర్కొన్నారు. 2011 కంటే ఇప్పుడు ముస్లింల జనాభా తగ్గినట్లు చూపించారని, బిహార్‌లో బిసిల జనాభా 10 శాతం పెరిగినట్లు చెప్పి కులాల వారీగా జాబితా ఇచ్చారని చెప్పారు. 4 వేల పేజీల నివేదికను ఎంఎల్‌ఎలు ఎప్పుడు ప్రిపేర్ కావాలని అడిగారు.

అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకుంటారని ఆరోపించారు. బిజెపితో మాట్లాడి బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో కులాల మధ్య కొట్లాటలు పెడుతున్నారని మండిపడ్డారు. తమకు ట్యాబ్‌లు ఇస్తే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. తెలంగాణలో మరో బిసి ఉద్యమం వస్తుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News