రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల జమతో లక్షలాది మొబైల్స్కు సందేశాల వెల్లువ
కొత్త రేషన్కార్డులతో మురిసిన పేదలముంగిళ్లు బడుగు, బలహీనవర్గాలకు అందిన ఇందిరమ్మ
ఇళ్లు ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలు విజయవంతంగా ప్రారంభం మొత్తం
6,15,677 మంది అర్హులకు లబ్ధి 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసా
చెల్లింపు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద రూ.10.91 కోట్లు 531 గ్రామాల్లో 15,414 కొత్త
రేషన్ కార్డుల పంపిణీ పాత రేషన్కార్డుల్లో 1.02లక్షల మంది అదనపు కుటుంబసభ్యుల పేర్లు
నమోదు 72 వేల మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ మరో రికార్డు నెలకొల్పిన ప్రజా ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజా ప్ర భుత్వం మరో రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించటంతో పాటు అక్కడికక్కడే 6,15,677 మంది అర్హులకు లబ్ధి చే సింది. అదే రోజున రైతుభరోసా, ఇందిర మ్మఆత్మీయ భరోసాకు ఆర్థికశాఖరూ. 579 కోట్లు విడుదల చేసింది. లక్షలాది మంది రై తులు, వ్యవసాయ కూలీల కుటుంబాల్లో ఈ నిధులు జమకావటంతో రాష్ట్రమంత టా సంతోషం వెల్లివిరిసింది. రాష్ట్ర ప్రభు త్వం ముందుగా ప్రకటించిన విధంగానే ప్రజా పాలనలో నాలుగు సంక్షేమ పథకాలు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజునే లక్షలాది మంది ఈ సంక్షేమ పథకాలను అందుకున్నారు. గణతంత్ర దినోత్స వం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలా ల్లో ఎంపిక చేసి న 563 గ్రామాల్లో ఈ పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది.
ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ ఆర్థిక సాయాన్ని అ ప్పటికప్పుడే వారి ఖాతాల్లో జమ చేసింది. ద రఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రేషన్ కార్డులు జారీ చేసింది. గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇం దిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించింది. మొదటి రోజునే రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్ల రైతు భరో సా విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లో ని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఎకరానికి తొలి విడతగా రూ. 6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఒక్క రోజులోనే మొత్తం రూ.569 కోట్లు వా రి ఖాతాల్లో జమ చేసింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది. 26వ తేదీన బ్యాంకులకు సెలవు రోజు కావటంతో 27 వ తేదీ ఉదయం నుంచి ఈ రైతు భరోసా ని ధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.
‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద 18, 180 వ్యవసాయ కూలీ కుటుంబాలకుతొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఆ త్మీయ భరోసా’ పథకం ప్రారంభించింది. ఈపథకం ద్వారా ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడతగా రూ.6 వేలు చెల్లించింది. తొలి రోజున దాదాపు 18,180 వేల వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజునే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది.
51,912 మంది కుటుంబ సభ్యులకు లబ్ధి
రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలకు కొత్త కార్డులు జారీ చేసింది. పాత కార్డుల్లో అదనంగా సభ్యులను నమోదు ప్రక్రియను పూర్తి చేసింది. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులకు ఎదురుచూసిన తెలంగాణ ప్రజల నిరీక్షణ ఫలించింది. ప్రజా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ ప్రారంభించింది. వీటితో పాటు పాత రేషన్ కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసింది. తొలి రోజున 531 గ్రామాల్లో 15,414 కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. వీటిలో 51,912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు. వీటితో పాటు అదనపు సభ్యులను చేర్చాలంటూ 1.02 లక్షల మంది కార్డుదారులు దరఖాస్తు చేసుకున్నారు. చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించింది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో అదనంగా 1,03,674 మంది కుటుంబ సభ్యులను నమోదు చేసింది. వచ్చే నెల నుంచి వీరికి రేషన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయనుంది.
అర్హులకు ఇందిరమ్మ పత్రాల పంపిణీ
గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో తొలి రోజునే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 72 వేల మంది పేదలకు మొదటిరోజు ఇళ్ల పత్రాలను అందించింది.