Friday, July 5, 2024

సత్ప్రవర్తన కింద మంది ఖైదీల విడుదలకు జివొ జారీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శ కాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలపడంతో 213 మంది ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీరిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఒక్కొక్కరు రూ.50వేల సొంత పూచీకత్తు సమర్పించాలని, 3 నెలలకోసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విడుదల కానున్న ఖైదీలందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని గవర్నర్ కార్యాలయం సూచించినట్లు తెలుస్తోంది. వీరికి జైళ్లశాఖ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లు లాంటి చోట్ల ఉ పాధి కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను చర్లపల్లి కేంద్ర కారాగానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా బుధవారం మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.

ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి లాంటి సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. అయితే, తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండుసార్లే ఇది కార్య రూపం దాల్చింది. 2016లో తొలిసారిగా ఖైదీలను విడుదల చేశారు. రెండోసారి 2020 అక్టోబర్ 2న 141 మందిని విడుదల చేశారు. 2022లో 150 మందిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినా పలు కారణాలతో ఆమోదించలేదు. ఈ ఏడాది జనవరిలోనే విడుదలకు జైళ్లశాఖ జాబితా చేసినప్పటికీ తాజాగా మార్గంసుగమమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News