Friday, October 18, 2024

21 నుంచి సియోల్ స్టడీ టూర్

- Advertisement -
- Advertisement -

మురికికూపంగా మారిన మూసీని ప్రక్షాళనతో నదికి పూర్వ వైభవం తేవడం, హైదరాబాద్ ను గొప్ప హెరిటేజ్ నగరంగా తీర్చిదిద్దడం , స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ఉపాధి కల్పన, ఆదాయ మార్గాలు అభివృద్ధి చేయడం కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. మూసీ పునరుజ్జీవనం కోసం మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులతో కూడిన బృందం ఈ నెల 21 నుంచి 24 వ తేదీ వరకూ దక్షిణ కొరియాలోని సియోల్ నగరాన్ని సందర్శించనుంది. సియోల్ లో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి బృంద సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఇందుకోసం బృంద సభ్యులు ఈ నెల 20 వ తేదీ వేకువ జామున హైదరాబాద్ నుండి దక్షిణ కొరియాకు బయలు దేరనున్నారు. తిరిగి ఈ నెల 25 వ తేదీన హైదరాబాద్‌కు చేరుకుంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News