Saturday, September 21, 2024

ఐదుగురికి డిజిలుగా ప్రమోషన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర పోలీస్ శాఖలో సీనియర్ అధికారులు పదోన్నతులు పొందారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐ దుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు డిజి హోదా లభించింది. అదనపు డిజిలుగా ఉన్న సీనియర్ ఐపిఎస్ అధికారులు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి, అభిలాష బిస్తి, సౌమ్య మిశ్రా, షికా గోయల్‌కు ప్రభుత్వం డిజిలుగా పదోన్నతి కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, సిఐడి చీఫ్  షికా గోయల్, జైళ్ల శాఖ చీఫ్ సౌమ్య మిశ్రా, తెలంగాణ పోలీస్ అకాడమి డైరెక్టర్ అభిలాష బిస్తి అవే స్థానాల్లో కొనసాగుతారని ఆదేశాల్లో సిఎస్ పేర్కొ న్నారు. డిజిలుగా పదోన్నతి పొందిన శివధర్‌రెడ్డి, షీకా గోయల్, సౌమ్యమిశ్రా, అభిలాష్ బిస్తిలు గురువారం రాష్ట్ర డిజిపిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి డిజిపి జితేందర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News