Wednesday, April 9, 2025

పనులు ఆపండి

- Advertisement -
- Advertisement -

గురువారం వరకు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల కేసులో హైకోర్టు
ఆదేశం సుప్రీం ఆదేశాలు ఉల్లంఘిస్తూ అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతున్నారని
హెచ్‌సియు న్యాయవాది ఆరోపణ అటవీ భూమిగా రికార్డుల్లో లేదని ఎజి
సుదర్శన్‌రెడ్డి వాదన కేసు నేటికి వాయిదా న్యాయస్థానం

మన తెలంగాణ/హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సియు విద్యార్థులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై హైకోర్టులో బుధవారం వాదనలు కొనసాగా యి. వాదనలు విన్న ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల్లో గురువారం వరకు పనులు ఆపాలని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.కంచగచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రక టిం చాలని వట ఫౌండేషన్, హెచ్‌సియు విద్యార్థు లు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీని పై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు కొన సా గాయి. హెచ్‌సియు తరపున ఎల్.రవిశంకర్ తన వాదనలు వినిపించారు.‘గత ఏడాది జూన్‌లో ప్రభుత్వం జిఒ 54 తీసుకొచ్చింది. ఈ జిఒ ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టిజిఐఐసికి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది.

కంచ గచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను కొట్టేసి, భూమని చదును చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. వన్యప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలి. నెల రోజుల పాటు అధ్యయనం చేయాలి. అక్కడ మూడు లేక్‌లు ఉన్నాయి. రాక్స్ ఉన్నాయి. ఎన్నో రకాల అరుదైన జంతువులున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయ’ని కోర్టుకు వెల్లడిం చారు. ప్రభుత్వం తరపున ఎజి సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ‘2024లో ఈ భూమిని ఐఎంజి అకాడమీకి అప్పగించారు. ఒప్పందం ప్రకారం ఐఎంజి ఈ భూములను వినియోగించలేదు. దీంతో అప్పటి ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసింది. ఆ భూముల్లో అటవీ భూమి అని ఎక్కడా లేదు. దీనికి ఆనుకొని ఉన్న హెచ్‌సియు భూముల్లో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్‌లున్నాయి.

హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయి. పిటిషనర్ల వాదనల ప్రకారం ఆయా ప్రాంతాలను కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడద’ని ఎజి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు ఈ భూమి అటవీ భూమి అని ఒక్క వాదన కూడా లేదు. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములని ప్రభుత్వం సైతం ఎక్కడా నోటిఫై చేయలేదన్నారు. ఇది పూర్తిగా పరిశ్రమలు, ఇతర అవసరాలకు కేటాయించిన స్థలం మాత్రమేనని, అటవీ భూమి కానే కాదన్నారు. నిజాం కాలం నుంచి ఈ భూమి బీడు భూమిగానే ఉందని కోర్టుకు వెల్లడించారు. అయితే ఈ 400 ఎకరాలు పరిశ్రమల భూమి అని రికార్డుల్లో ఎక్కడైనా ఉందా? అని హైకోర్టు ఎజిని ప్రశ్నించింది. సర్వె నెంబర్ 25లో ఉన్న ఈ భూములను పలు అవసరాలకు కేటాయిస్తూ వచ్చారని న్యాయస్థానానికి వెల్లడిం చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం గురువారం వరకు ఆ భూముల్లో పనులు ఆపాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News