Thursday, September 19, 2024

మొబైల్ ఫోన్ల రికవరీలో రెండవ స్థానంలో తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణ నిలిచింది. రాష్ట్ర పోలీసులు 2024 జనవరి 1 నుండి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ పరికరాలను విజయవంతంగా రికవరీ చేశారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి ఓ టి) సి ఈ ఐ ఆర్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను అధికారికంగా 2023 మే 17న దేశ వ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పోర్టల్ 2023 ఏప్రిల్ 19 నుండి ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో సిఐడి అదనపు డిజిపి శిఖా గోయెల్, , సీఈఐఆర్ పోర్టల్‌కు నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో గల 780 పోలీస్ స్టేషన్‌లు ఈ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నాయి. 2024లో 206 రోజుల్లో 21,193 పోగొట్టుకున్న/దొంగిలించబడిన మొబైల్ పరికరాలను రికవరీ చేయడంలో పోలీసులు విజయం సాధించారు. . గత 8 రోజుల్లోనే 1000 పరికరాలను రికవరీ చేసి, వాటిని ఫిర్యాదుదారులకు అప్పగించారు. ప్రతిరోజు సగటున 82 మొబైల్‌లను రికవరీ చేస్తున్నారు.

ప్రధాన మైలురాళ్ళు
* 10,000 మొబైల్‌లు: 189 రోజుల్లో
* 20,000 మొబైల్‌లు: 291 రోజుల్లో
* 30,000 మొబైల్‌లు: 395 రోజుల్లో
* 37,000 మొబైల్‌లు: 459 రోజుల్లో

రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో (3808) తరువాత రాచకొండ కమిషనరేట్ పరిధిలో (2174), సైబరాబాద్ కమిషన రేట్ పరిధిలో (2030) మొబైల్ పరికరాలను రికవరీ చేశారు. తెలంగాణ పౌరులకు మరింత సులభంగా, మెరుగుగా సేవలు అందించడానికి, తెలంగాణ పోలీసులు టెలికాం శాఖ (డి వో టి) తో కలిసి సీఈఐ ఆర్ పోర్టల్‌ను తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్‌తో అనుసంధానించారు. పోగొట్టుకున్న/దొంగిలించబడిన మొబైల్ పరికరాల గురించి రిపోర్ట్ చేయడానికి ప్రజలు www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్‌సైట్‌లను ఉపయోగించవచ్చు. ప్రారంభమైనప్పటి నుండి, సి ఇ ఐఆర్ పోర్టల్ తెలంగాణ పోలీసులచే స్నేహపూర్వక కార్యక్రమాలలో ఒకటిగా ఉద్భవించింది.

మొబైల్ పరికరాలను కోల్పోయిన వ్యక్తులకు ఇది ఒక ఆశాదీపంగా మారింది. అనేక మంది వినియోగదారుల నుండి వచ్చిన టెస్టిమోనియల్‌లు పోర్టల్ యొక్క ప్రభావాన్ని మరియు పోగొట్టుకున్న ఫోన్‌లను తిరిగి పొందడంలో ఇది చూపిన సానుకూల ప్రభావాన్ని ధృవీకరిస్తాయి. సైబర్ క్రైం, సిఐడి ఎస్‌పి డాక్టర్ లావణ్య, డిఓటి అధికారులతో సమన్వయంతో, సెక్యూరిటీ డిడిజి హేమంత్ రాథ్వే, సెక్యూరిటీ డైరెక్టర్ ఎం. అరవింద్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ (సెక్యూరిటీ ఆడిట్) కె.లక్ష్మణ కుమార్, ఐటి సెల్, సిఐడి ఇన్‌స్పెక్టర్ సిహెచ్ సురేష్ బాబు రాష్ట్రంలో సీఈఐఆర్‌ను ఉపయోగించడంలో సిఐడి అదనపు డిజిపికు సహకరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News