Tuesday, September 17, 2024

యువత కోసం అంకురంను ప్రారంభించిన సమగ్ర శిక్ష తెలంగాణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రేడ్ 11 విద్యార్థుల కోసం అంకురం బిజినెస్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రామ్, గ్రేడ్ 9 విద్యార్థుల కోసం అంకురం ఎంట్రప్రెన్యూరియల్ మైండ్‌సెట్ ప్రోగ్రామ్‌ను హైదరాబాద్‌లోని టి-హబ్‌లోని అంకురం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం తెలంగాణలోని 33 జిల్లాల్లోని 409 పాఠశాలల్లోని గ్రేడ్ 11, గ్రేడ్ 9 విద్యార్థులలో వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించడంతోపాటు 21వ శతాబ్దపు నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది.

గత సంవత్సరం 35 పాఠశాలల నుండి 2,800 మంది విద్యార్థులు పాల్గొనటంతో కార్యక్రమం విజయవంతమైందని వెల్లడించారు. గ్రేడ్ 11 కు చెందిన విద్యార్థుల టాప్ 20 వ్యాపార ఆలోచనలు ప్రదర్శించబడ్డాయి, సమగ్ర శిక్షా తెలంగాణ నుండి 995 మంది విద్యార్థులు సీడ్ మనీని అందుకున్నారు. ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్, ఇంక్విలాబ్ ఫౌండేషన్, వై-హబ్, ఓక్‌నార్త్ భాగస్వామ్యంతో సమగ్ర శిక్షా తెలంగాణా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా హాజరయ్యారు.

ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ యొక్క సీఈఓ & వ్యవస్థాపకులు మేకిన్ మహేన్శ్వరి మాట్లాడుతూ, “తెలంగాణలోని 35 ప్రభుత్వ పాఠశాలల్లో పైలట్‌ ప్రాజెక్ట్ గా ప్రారంభించబడిన కార్యక్రమం ఇప్పుడు మొత్తం 33 జిల్లాల్లో 409 పాఠశాలల్లో 9, 11వ తరగతులు కు చెందిన దాదాపు 50,000 మంది విద్యార్థులను చేరుకునేందుకు సిద్ధంగా ఉంది. భారతదేశం అంతటా వ్యవస్థాపక ఆలోచనా ధోరణి నిర్మాణం లో ఉద్యమ్ అనుభవాన్ని, తెలంగాణా పరంగా ఇంక్విలాబ్స్ బలమైన అవగాహన, వై -హబ్ తెలంగాణ ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానంతో దీన్ని వ్యాప్తి చేయటం ద్వారా మేము పాఠశాలలో వ్యాపార పర్యావరణ వ్యవస్థ ను సైతం అభివృద్ధి చేస్తున్నాము” అని అన్నారు.

ఇంక్వి-ల్యాబ్ కో-ఫౌండర్, వివేక్ పిద్దెంపల్లి మాట్లాడుతూ.. యువ పారిశ్రామికవేత్తల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలని మేము భావిస్తున్నామన్నారు. ఓక్‌నార్త్‌కు చెందిన సిఎస్‌ఆర్ హెడ్ తారా చంద్ మాట్లాడుతూ “యువకులలో వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News