Monday, April 28, 2025

మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి 22 వరకు అన్ని తరగతుల ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆరో తరగతిలో ప్రవేశాలకు ఉదయం 10 గంటల నంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News