Wednesday, September 18, 2024

మిలియన్ మార్చ్ తరహాలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మహోత్సవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని సిఎం రేవంత్ తెలిపారు. దొరతనాని కి ప్రతీకగా కాకుండా ప్రజలు తమ కన్నతల్లిని చూ సుకున్నంత సంతోషకరంగా తెలంగాణ తల్లి రూపం ఉంటుందని స్పష్టం చేశారు. విగ్రహ నమూనా రూపొందించే బాధ్యతను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్ విభాగానికి అప్పగించామన్నారు. హైదరాబాదులో ని రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సిఎం బుధవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేత కె.కేశవరావు తదితరులు హా జరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూమి పూజ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని భావించామ ని, కానీ సమయం లేదని తెలిపారు. కొన్ని రోజుల వరకు మంచి ముహుర్తాలు లేకపోవడంతో, ము హుర్తానికి భూమి పూజ చేశామని వెల్లడించారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ స్వప్నం సాకారమైందని రేవంత్ స్పష్టం చేశారు. గత సర్కారు ప దేళ్ల పాటు తెలంగాణ తల్లిని మరుగునపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఏర్పాటు ప్రక్రి య ప్రారంభమైన డిసెంబరు 9వ తేదీ అంటే తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని, ఆ రోజునే తె లంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని రేవంత్ రె డ్డి ప్రకటించారు. మిలియన్ మార్చ్ తరహాలో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. డాక్టర్ బీఆ ర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు సిఎం భూమిపూజ చేశారు. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది సమక్షంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వైభవోపేతంగా జరుపుతామని ప్రకటించారు. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని తెలంగాణ ఉద్యమం నిరూపించిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ఆవరణలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని దశాబ్ది వేడుకల సందర్భంలోనే తాను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, దానికి ఎదురుగా పీవీ నర్సింహారావు, అంజయ్య ్ల విగ్రహాలు, జైపాల్ రెడ్డి స్మారకం, ఇటువైపు కాకా వెంకటస్వామి తదితర మహానుభావుల విగ్రహాలు, అమరవీరుల స్మారకచిహ్నం –

సచివాలయానికి మధ్య దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం శోభాయమానంగా ఉంటుందని, మేధావుల సూచనల మేరకే ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గడచిన పదేండ్లలో తెలంగాణ తల్లిని తెరమరుగు చేసిన గత పాలకులు సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో తమ విగ్రహం పెట్టుకోవడానికి ప్రయత్నించారని, అయితే ప్రజల ఆశీర్వాదంతో అధికారంలో వచ్చిన ప్రజా ప్రభుత్వం ఆ ప్రయత్నాలను అడ్డుకుని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్టిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News