Tuesday, September 17, 2024

తెలంగాణ నుంచి అరుణాచలంకు అందుబాటు ధరలో టూరిజం ప్యాకేజీ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమిళనాడులో పుణ్యక్షేత్రాల్లో ఒకటైనా అరుణాచలంను సందర్శించేందుకు ఇటీవల పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టూరిజం భక్తుల కోసం ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి అరుణాచలంకు తెలంగాణ టూరిజం ‘హైదరాబాద్‌-అరుణాచలం’ పేరుతో ఓ ప్యాకేజీని అందిస్తోంది.

హైదరాబాద్‌ నుంచి ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. 3 రాత్రులు, 4  రోజుల పాటు ఈ టూర్‌ సాగుతుంది. ఇందులో భాగంగా అరుణాచలేశ్వర ఆలయం, కాణిపాకం, వేలూరు గోల్డెన్‌ టెంపుల్ కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేదీన అందుబాటులో ఉంది. ఇది తప్పితే… అక్టోబర్‌లో మరోసారి అవకాశం కల్పించనున్నారు.

ప్రయాణం ఇలా మొదలవుతుంది…

*  మొదటి రోజు  హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ప్రయాణం మొదలవుతుంది.

* రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు.  ఫ్రెషప్‌ అయిన తర్వాత ఉదయం 9 గంటల లోపు దర్శనం పూర్తి చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు.

*  మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రి అరుణాచలంలోనే బస ఉంటుంది.

*   ఇక మూడో రోజు ఉదయం టిఫిన్‌ పూర్తి కాగానే అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు బయలు దేరుతారు. సాయంత్రం దర్శనం పూర్తి అవుతుంది. వెంటనే తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

* 4వ రోజు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు ఇలా:

ఏసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టూర్‌లో పెద్దలకు ప్యాకేజీని రూ.8,000, పిల్లలకు రూ.6,400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో బస్ జర్నీ, హోటల్స్‌ కవర్‌ అవుతాయి. ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు స్వంతంగానే ఖర్చు భరించాల్సి ఉంటుంది.

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News