Sunday, July 7, 2024

అమెరికాలో తెలుగు యువతుల దొంగతనాలు… అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల్లో రెండు ఉదంతాలు జరగడంతో వారిని అరెస్టు చేశారు. డల్లాస్‌లోని మాసీ మాల్‌లోకి ఇద్దరు భారతీయ విద్యార్థినులు చోరీకి పాల్పడ్డారు. కారం రవీందర్ రెడ్డి కూతురు కారం మానస రెడ్డి,  పులియల జితేందర్ రెడ్డి కుమార్తె సింధూజారెడ్డి అమెరికాలో చదువుతున్నారు. వీరిలో ఒకరైన మానసరెడ్డి గతంలో పలు దొంగతనాలకు పాల్పడి బెయిల్ మంజూరైనప్పటికీ మళ్లీ దొంగతనం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సంఘటన విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్థుల ప్రవర్తన గురించి ఆందోళన కలిగిస్తుంది. ఇదే తరహాలో ఏప్రిల్ నెలలో ఓ స్టోర్ లో భవ్య లింగనగుంట (20), యామిని వల్కలపుడి (22) అనే ఇద్దరు యువతులు వస్తువులు తీసుకుని డబ్బులు చెల్లించకుండా వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News