Thursday, September 19, 2024

‘తెలుసు కదా’ షూటింగ్ షురూ

- Advertisement -
- Advertisement -

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత తన నెక్స్ ప్రాజెక్ట్ ’తెలుసు కదా’తో అలరించబోతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. నీరజ కోన… సిద్దు స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఇది 30 రోజుల పాటు సాగే కీలకమైన షెడ్యూల్. ఇందులో టాకీ సీన్స్, మ్యూజిక్ నెంబర్స్ షూట్ చేస్తున్నారు. రాశీ ఖన్నా మొదటి రోజు షూటింగ్‌లో సిద్దూతో కలిసి చేరింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News