Friday, April 25, 2025

మల్లారెడ్డి ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్ లోని మల్లారెడ్డి ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ల నిర్లక్ష్యపు వైద్యంతో యువతి ప్రాణాలు కోల్పోయిందని బందువులు ఆందోళన చేపట్టారు. ఈ  నేపథ్యంలో కవరేజీ కీ వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. మల్లారెడ్డి ఆసుపత్రి లో గల బౌన్సర్లు కవరేజీ కి వచ్చిన ఆర్ టివి న్యూస్ స్టాఫర్,కెమెరామెన్ మరియు లోకల్ రిపోర్టర్ పై దాడి చేశారు.ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు సూరారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News