Sunday, February 23, 2025

కశ్మీర్ పండిట్ ను కాల్చిచంపిన తీవ్రవాదులు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: తీవ్రవాదులు కశ్మీర్‌కు చెందిన పండిట్ ప్రభుత్వాఫీసులో కాల్చి చంపిన సంఘటన జమ్ము కశ్మీర్‌లోని బుడ్గమ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పండిట్ కులానికి చెందిన రాహుల్ భట్ చదూరా ఎంఆర్‌ఒ ఆఫీసులో పని చేస్తున్నాడు. ఇద్దరు తీవ్రవాదులు అతడిని తుపాకీతో రాహుల్‌ను కాల్చారు. రక్తపు మడుగులో ఉన్న రాహుల్‌ను ఎస్‌ఎంహెచ్‌ఎస్ ఆస్పత్రికి తరలించారు. రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రవాదులే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనను మాజీ సిఎం ఓమర్ అబ్దుల్లా ఖండించారు. ఇలాంటి ఘటనను సహించబోమని హెచ్చరించారు. రాహుల్ మృతిపై సంతాపం తెలిపారు. వాళ్ల ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News