Tuesday, September 17, 2024

రేపు డిఎస్‌సి హాల్ టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో డిఎస్‌సి పరీక్షలు యథాతథంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈ మేరకు గురువారం(జులై 11) సాయంత్రం డిఎస్‌సి హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో డిఎస్‌సి పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్‌సి -2024 పరీక్షలు ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి పరీక్ష జరగనున్నది. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఎస్‌సి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇటీవల సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించారు. డిఎస్‌సి 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా…గత నెల 20వ తేదీతో గడువు ముగిసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News