Tuesday, October 22, 2024

రైతు కమిషన్‌కు ఏడుగురు సభ్యులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైతు కమిషన్‌కు నూతన సభ్యులను నియమించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్‌గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోదండ రెడ్డిని నియమిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చిన ప్ర భుత్వం తాజాగా సోమవారం సభ్యులను కూడా నియమించింది. సభ్యులతో కూడిన రైతు కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ రైతు కమిషన్‌లో గతంలో ఆరుగురు సభ్యులు ఉండగా ఈసారి ఆ సంఖ్య ఏడుకు సవరించింది. ఇందులో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, న్యాయవాది సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, కె.వి.నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాద వ్, మరికంటి భవాని సభ్యులుగా నియామించారు. వీరు రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునంద న రావు జిఓ 774లో ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News