Tuesday, April 8, 2025

ఆర్టీసీ ఉద్యోగులకు 2.5శాతం డిఎ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రా ష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఆర్‌టిసి ఉద్యోగులకు 2.5 శాతం డిఏను చెల్లిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిఎ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీ సంస్థపై రూ.3.6 కోట్లు అదనపు భారం పడుతుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. దాదా పు రూ.5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ప్రయాణం చేసినట్లు మంత్రి వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు ప్రతి రోజూ 14 లక్షల మహిళలు అదనంగా ప్రయా ణం చేస్తున్నారని వెల్లడించారు. దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తి డి పెరిగి వారు నిరంతరం శ్రమిస్తున్నారని మం త్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. మహిళా ప్రయాణికులు అదనంగా పెరగడంతో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగిందని అన్నారు. మహి ళా సమైక్య సంఘాలతో బస్సులు కొనిపించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన ఆ బస్సులు నడిపించి తద్వారా మహిళలు ఆదాయాన్ని అర్జించాలని

భావించి తొలి విడతగా 150 బస్సులను ఆర్టీసికి అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసారి మహిళా సంఘాల చేత ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టీ బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీతో అద్దె ప్రాతిపదికన ఒప్పందం జరగగా రేపు మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, తాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పైలెట్ ప్రాజెక్టు పాత ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News