Friday, September 20, 2024

స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

త్వరలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పైన మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. పార్టీ మారిన ప్రస్తుత ఎంఎల్‌ఎ కడియం శ్రీహరిపైన అనర్హతవేటు ఖాయమని పేర్కొన్నారు. త్వరలోనే స్టేషన్ ఘనపూర్‌కు ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో శుక్రవారం కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపైన తాటికొండ రాజయ్య పలు సలహాలు, సూచనలు కెటిఆర్‌తో పంచుకున్నారు. పార్టీని మోసం చేసి, ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి రాజకీయ స్వార్థంతో పార్టీ మారిన కడియం శ్రీహరిని స్టేషన్ ఘన్‌పూర్‌లో ఓడించేందుకు ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా రాజయ్య తెలిపారు.

ఈ మేరకు భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులన్నీ కడియం శ్రీహరికి బుద్ధి చెబుతాయన్నారు. ఇప్పటికే తాటికొండ రాజయ్య గారిని స్టేషన్‌ఘన్‌పూర్ ఎన్నికల అభ్యర్థిగా పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన నాయకత్వంలో మరోసారి స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండాను ఎగురవేస్తామని కెటిఆర్ అన్నారు. పార్టీని మరింతగా సంస్థాగతంగా నిర్మాణం చేయడం కోసం త్వరలోనే నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులతో త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌లో ఒక విస్తతస్ధాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న మండల పార్టీ నాయకులతో మాట్లాడి తేదీలను నిర్ణయించాలని కెటిఆర్ రాజయ్యకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ స్వార్థంతో పార్టీని వీడిన కడియం శ్రీహరికి బిఆర్‌ఎస్ శ్రేణులు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాయని ఈ సందర్భంగా కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News