Saturday, February 22, 2025

హనుమకొండలో దారుణం.. ఆడ శిశువును పూడ్చిపెట్టారు

- Advertisement -
- Advertisement -

హనుమకొండ జిల్లా దామెర మండలం ఉరుగొండ వద్ద దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆడ శిశువును పూడ్చిపెట్టారు. శిశువుని చూసిన స్థానికులు మట్టిని తొలగించి బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని శిశువును ఆస్పత్రికి తరలించారు. శిశువు ఎవరు.. ఎందుకు పూడ్చిపెట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News