Sunday, February 23, 2025

పిడిఎస్ గోధుమలను పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ గోధుమలను బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 20టన్నుల గోధుమలను పట్టుకున్నారు. వాటి విలువ రూ.7లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం… సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పిడిఎస్ గోధుమలను నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు గోధుమలను నిల్వ చేసిన గోడౌన్ గుర్తించి దాడి చేశారు. గోధుమలను సీజ్ చేసి సివిల్ సప్లయ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అప్పగించారు. అక్రమంగా నిల్వ చేసిన గోధుమలను నిందితులు ఎక్కడి నుంచి సేకరించారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News