- Advertisement -
గతేడాది అక్షయ తృతీయ నుంచి ఈ ఏడాది అక్షయ తృతీయతో పోలిస్తే బంగారం ధరలు ఒక్క సంవత్సరంలోనే 40 శాతం పెరిగాయి. ఇప్పటికీ ఈ పసుపు లోహంపై విశ్లేషకులు బుల్లిష్గా ఉన్నారు. ప్రస్తుత స్థాయి రూ.46,500 నుంచి ఈ ఏడాది చివరి నాటికి పసిడి రూ.50 వేలకు(10 గ్రాములు) చేరనుందని అంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ కన్సల్టింగ్ సంస్థ మిల్వుడ్ కాన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సిఇఒ నిష్ భట్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఆఖరి నాటికి బంగారం విలువ 40 శాతం పెరగనుందని అన్నారు. ద్రవ్యోల్బణానికి పరిష్కారంగా బంగారం బాగా పనిచేస్తుందని, చారిత్రకంగా చూసినా అనిశ్చితి పరిస్థితుల్లో వీటి విలువ గణనీయంగా పెరుగుతూ వచ్చిందని తెలిపారు.
The value of Gold goes up by 40 per cent
- Advertisement -