Saturday, September 28, 2024

మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ శివారులోని జల్ పల్లిలో తన ఇంట్లో పది లక్షల రూపాయలు నాయక్ అనే పని మనిషి దొంగలించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నాయక్ తిరుపతిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నాయక్ ను త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. నాయక్ దొంగతన చేసిన వెంటనే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News