Sunday, September 8, 2024

ఊపేమి లేదు…ప్రధాని భాషలో విషం ఉంది: జైరామ్ రమేశ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ‘హిందు- ముస్లిం, మంగళసూత్రం’ వంటి విచ్ఛినకర మాటలని ప్రధాని మాట్లాడుతున్నారన్నారు. ప్రధాని భాషలో ఊపేమి(లెహర్) లేదు… అంతా విషమే(జహర్) ఉందన్నారు.

ప్రధాని మాట్లాడే బాష ప్రకారం ఆయన అయోమయంలో ఉన్నట్లు అర్థమవుతోంది. కొన్ని సందర్భాల్లో ఆయన హిందు-ముస్లిం గురించి మాట్లాడతారు, లేకపోతే మంగళసూత్రం గురించి మాట్లాడతారని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోరాడుతోందని జై రామ్ రమేశ్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News