Sunday, April 27, 2025

భారత, పాకిస్థాన్ తీరం తాకనున్న తుఫాను

- Advertisement -
- Advertisement -

వేలాది మంది తరలింపు

అహ్మదాబాద్/ఇస్లామాబాద్: భారీ వర్షాలు అరేబియా సముద్రం వెంబడి భారతదేశం, పాకిస్థాన్ తీర ప్రాంతాలను దెబ్బతీశాయి. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని నగరాలను వరదలు ముంచెత్తాయి , వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు,  తుఫాను ఛాన్సుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వాహనాలు రోడ్లలో పాక్షికంగా మునిగిపోయాయి.  నడుము ఎత్తులో ఉన్న నీటిలో ప్రజలు నడుస్తున్నట్లు రాయిటర్స్ టెలివిజన్ విజువల్స్ చూపించాయి.

గుజరాత్ రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన సంఘటనల కారణంగా ఈ వారంలో కనీసం 28 మంది మరణించారని అధికారులు తెలిపారు. భారతదేశం పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోని వాతావరణ శాస్త్రవేత్తలు మరింత భారీ వర్షాలు , బలమైన గాలులు తీరాన్ని తాకే అవకాశం ఉందని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News