Thursday, July 4, 2024

బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్

- Advertisement -
- Advertisement -

గోషామహల్ బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు పలు నెంబర్ల నుంచి ఫోన్ చేసి చంపుతామని బెదిరించినట్టు రాజాసింగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇలాంటి బెదిరింపులకు గురికావడం ఇదే తొలిసారి కాదని, గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని అన్నారు. అయినప్పటికీ బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ పరిస్థితిని పోలీసులకు తెలియపరుస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డిజిపి రవిగుప్తాకు ఆయన లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News