Saturday, September 21, 2024

ఎలుగుబంటి దాడిలో ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three killed in bear attack in Jharkhand

 

రాంఛీ: ఎలుగుబంటి దాడిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రం గర్హా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బర్కోల్ ఖుర్ద్ గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు బయట నుంచి రాత్రి 8 గంటల ప్రాంతంలో తన సొంతూరుకు  వస్తుండగా వారిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు సునీత్ గిధ్(40), అనిత్ గిధ్(35), రాజ్‌కుమార్ ఓరౌన్(37)గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రెండు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని అటవీ శాఖ ఉన్నతాధికారి శశి కుమార్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News