Sunday, February 23, 2025

ఎసి పేలి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం రాయ్‌గఢ్ జిల్లా అలీబగ్ ప్రాంతంలో ఎసి కంప్రెసర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాల్ ప్రాంతంలో రాష్ట్రీయ కెమికల్స్ ఫెర్టలైజర్స్ షాపులో ఎసిని ఆరుగురు కూలీలు రిపేర్ చేస్తుండగా గురువారం సాయంత్రం పేలింది. ఈ ఘటనలో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. గాయపడిన మరో ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాయ్‌గఢ్ ఎస్‌పి సోమనాథ్ ఘర్గే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News