Wednesday, July 3, 2024

నేర న్యాయంలో నవశకం

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి భారత నేర న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం. బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్(ఐపిసి), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సిఆర్‌పిసి), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(ఐఇఎ) ఈ మూడు చట్టాలకు చెల్లుచీటి పలికినట్లే. నేటి నుంచి (జులై 1) వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష అధినియం అమల్లోకి వచ్చాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నూతన చట్టాలకు పురుడుపోసి అమల్లోకి తెస్తోంది. ఈ నూతన చట్టాల అమలుకు యావత్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మున్ముందు జరగబోయే నేర న్యాయ విచారణలో నూతన చట్టాలు ఇతోధికంగా సాయ పడుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. బాధితులకు సత్వర న్యాయం చేకూరుతుందని విశ్వాసం ప్రకటించింది.

న్యూఢిల్లీ: దేశంలో జులై 1 నుంచి మూడు కొత్త న్యాయచట్టాలు అమలు లోకి వస్తున్నాయి. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పిసి), స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ ఎస్‌ఎస్ ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ ) స్థానంలో భారతీయ సాక్ష అధినియం (బీఎస్‌ఏ ) రాబోతున్న విషయం తెలిసిందే. అయితే వీటిపై ఒకవై పు నిరసనలు వ్యక్తమవుతుండగా, మరోవైపు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం స న్నద్ధమైంది. ఇప్పటికే అనేక దశలుగా పోలీస్‌లకు శిక్షణ శిబిరాలు నిర్వహిం చారు. కంప్యూటర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేశారు. ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయవిచారణ చేసేం దుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

కొత్త చట్టాల ప్రకారం..
l బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయవచ్చు. దీంతో వేగవంతంగా చర్యలు తీ సుకొనే వెసులుబాటు పోలీసులకు లభిస్తుంది.
l జీరో ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్‌స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చు.
ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసును కొలిక్కి తేవాలి.
l అరెస్ట్ సందర్భాలలో బాధితుడు సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొంద డానికి వీలవుతుంది.
l రెడుస్ట్‌ల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌తోపాటు జిల్లా ప్రధాన కేంద్రా ల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్ట్‌కు సంబంధించిన ముఖ్య మైన సమాచారాన్ని బాధితుల కుటుంబీకులు, స్నేహితులు తేలికగా తెలుసు కునే వీలుంటుంది.
l హేయమైన నేరాల్లో ఇకనుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి. ఏడేళ్లకు పైగా ఱెడున్సిక్ నిపుణులు సంఘటన స్థలాని కి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీంతో దర్యాప్తులో నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుందని చెబుతున్నారు.

l మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి కావాలి. అంతే కాదు బాధిత మహిళలు , చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స , వైద్య చికిత్స కు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి.
l ఇక సమన్లు ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పంపించవచ్చు.
l మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేని పక్షం లో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలి.
l బాధితులతోపాటు నిందితులు కూడా ఎఫ్‌ఐఆర్ నకళ్లను ఉచితంగా పొందే వీలుంటుంది. వీటితోపాటు పోలీస్ రిపోర్టు, ఛార్జిషీటు, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పొందవచ్చు.
l కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యా యం అందేలా చేయడానికి, న్యాయస్థానాలు కూడా గరిష్ఠంగా రెండు వాయి దాలు మాత్రమే మంజూరు చేస్తాయి.
l సాక్షుల భద్రతను వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని, సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి.

l అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో , వీడియో ద్వారా పోలీస్‌లు నమోదు చేయాలి.
l మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతోపాటు 15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు తాము నివాసం ఉన్న చోటే పోలీస్‌ల సా యం పొందవచ్చు.
l స్వల్ప నేరాలకు సంబంధించి నేరస్థులకు సమాజ సేవ చేసే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి.
l ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న ఆస్తులనూ పోలీసులు జప్తు చేసే అధికారం ఉంటుంది.
l సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్షాలన్నింటినీ జాతీయ స్థా యిలో ఏర్పాటు చేసిన డిజి లాకర్‌లో భద్రపరుస్తారు. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం (సీసీటీఎన్‌ఎస్) ద్వారా ఇప్పటికే దేశ వ్యాప్తంగా అ న్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేసినందున , సాక్షాలను ఆన్‌లైన్ ద్వారా పంపుతారు. డిజి లాకర్‌ను ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీ జేఎస్)కు అనుసంధానం చేస్తారు. పోలీస్‌లు, న్యాయవాదులు, న్యాయమూర్తు లు అవసరమైనప్పుడు సాక్షాలను పరిశీలించుకోవచ్చు. దీని వల్ల ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు.

సందిగ్ధ అంశాలు
ఈ చట్టాల అమలులో కొన్ని సరళమయ్యే అంశాలు ఉన్నప్పటికీ సందిగ్ధం అయ్యే అంశాలు కొన్ని ఉన్నాయి. ఏవైనా నేరాలు కొత్త చట్టం అమలు లోకి రావడానికి ముందు , అంటే 2024 జూన్ 30కి ముందు మొదలై, అమలు లోకి వచ్చిన తరువాత అంటే 2024 జులై 1 తరువాత కూడా కొనసాగుతుంటే బహుళ నేరాలకు పాల్పడిన వ్యక్తులపై చివరి కేసు నమోదైన తేదీనే పరిగణన లోకి తీసుకోవాలి. 2024 జూన్ 30 లోపు నేరం జరిగి, జులై 1 తర్వాత అది బయటపడితే, నేరం జరిగిన సమయమే ప్రామాణికం. అంటే పాతచట్టం ప్రకా రమే కేసు నమోదు చేయాలి. దర్యాప్తు అధికారులు , న్యాయవాదులు, న్యాయ స్థానాలను గందరగోళానికి గురిచేసే విషయమిది. పాత చట్టాల కింద నమో దైన కొన్ని కేసులు నెలల తరబడి దర్యాప్తు, కొన్నేళ్ల పాటు విచారణ జరిగే అవకాశం ఉంది.

దీంతో దర్యాప్తు అధికారులు పాత, కొత్త చట్టాలపై సమగ్ర అవగాహనతో ఉండాలి. రెండు రకాల కేసులు కలిపి దర్యాప్తు, న్యాయ విచార ణ జరిపేటప్పుడు, సంక్లిష్టత ఎదురయ్యే అవకాశం ఉంది. పోలీస్ కంప్యూటర్ వ్యవస్థలో జులై 1 నుంచి కొత్త చట్టాలకు అనుగుణంగా మార్పులు చేసినందున , పాత కేసుల దర్యాప్తులో సమస్యలు తప్పక పోవచ్చని సిబ్బంది చెబుతు న్నారు. చాలా రాష్ట్రాలో సీసీటీఎస్‌ఎస, ఐసీజెఎస్ పూర్తి కాలేదు. ఇటువంటి చోట పరిస్థితి ఏమిటన్నది స్పష్టత లేదు. దర్యాప్తు అధికారులు తమకు కావలసినప్పుడు పాత పత్రాలు, సాక్షాల వంటివి డిజి లాకర్ ద్వారా ఎలా చూసుకోవాలన్న అంశం లోనూ స్పష్టత లేదు. చిన్నచిన్న నేరాలకు సామాజిక సేవలు చేయించడం వంటి శిక్షలు విధించవచ్చు. కానీ ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు విధించాలన్న దానిపై స్పష్టత లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News