Thursday, September 19, 2024

అక్టోబర్ 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం తిరుమలకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

శనివారం శ్రీవారిని 60,694 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 27,350 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. కాగా, అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 16 నుంచి 18 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News