Tuesday, September 17, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

కాగా.. శనివారం శ్రీవారిని 79,313 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 39,344 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

ఈ నెల 14న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News