Thursday, October 24, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం.. దర్శనానికి ఎంత సమయమంటే..?

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. రెండు మూడు రోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. అయితే, గురువారం మళ్లీ భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక, మంగళవారం శ్రీవారిని 64,447 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 25,555 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.38 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News