Tuesday, September 17, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటలు

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శనివారం శ్రీవారిని 79,313 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 39,344 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

కాగా..రేపటి నుంచి ఆన్‌లైన్‌లో నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. రేపు లక్కీడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తారు. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News