Wednesday, September 18, 2024

తిరుమలలో రద్దీ.. 13 కంపార్టుమెంట్లలో భక్తులు..

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

కాగా, శుక్రవారం శ్రీవారిని 60,694 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 27,350 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News